19.7 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి రాజీనామా ఆమోదం

ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ఎండీ దినేష్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. జీవీ రెడ్డి ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం ఆమోదించారు. ఆ వెంటనే ఎండీ దినేష్‌కుమార్‌కూ స్థానచలనం కల్పించారు.

ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ దినేష్‌కుమార్, కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై సంస్థ ఆర్థికమూలాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఛైర్మన్‌గా తాను సంస్కరణలు తీసుకొచ్చినా ఆదాయం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫైబర్ నెట్‌లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపైనా జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీకి సానుభూతిపరులు అయిన ఉద్యోగులను జీవీ రెడ్డి తొలగించినప్పటికీ ఫైబర్ నెట్‌ ఎండీ ఆమోదం తెలపలేదని ఆగ్రహంగా వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు. బహిరంగ ఆరోపణలు చేయడమేంటని జీవీరెడ్డిపై మండిపడ్డారు. ఇకపై గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఆ వ్యవహారంలో దినేష్‌కుమార్‌ తప్పిదమూ ఉందని తేలడంతో ఆయననూ మందలించారు. అధికారులతో కలిసి పని చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆరోపణలు చేసిన అధికారులతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతోనే రాజీనామా చేశానని జీవీ రెడ్డి తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్