27 C
Hyderabad
Thursday, May 1, 2025
spot_img

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Accedent | నిజామాబాద్‌ శివారు ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వేగంగా వస్తున్న డీసీఎం ఆటోని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి అక్కడకిక్కడే చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే క్షతగాత్రులకువెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. డీసీఎం వేగంగా ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్సిడెంట్ అయిన వెంటనే ఘటనాస్థలం నుంచి డీసీఎం డ్రైవర్‌ పరారయినట్లు తెలుస్తోంది. బోధన్‌ నుంచి నిజామాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతిలు, క్షతగాత్రులు బోధన్​ మండలం ఊట్​పల్లి గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించారు.

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్