ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆనంద్, ఇందిర దంపతులకు ఓ కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా దంపతులు తీవ్రమైన అప్పుల బాధతో ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సన్ సిటీలోని తమ ఫ్లాట్లో మూడేళ్ళ కుమారుడికి విషం తాగించి తాము తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.


