34.3 C
Hyderabad
Sunday, April 20, 2025
spot_img

కృష్ణాజిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ పి రాజాబాబుపై ఈసీ వేటు

       కృష్ణా జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ పి రాజాబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రతిపక్ష పార్టీల నుండి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో జిల్లా కలెక్టర్ రాజాబాబు కూడా ఉన్నారు. 2023 ఏప్రిల్ 15న జిల్లా కలెక్టర్ గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. నాటి నుండి నేటి ఆయన అధికార నేతలకు అనుకూ లంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ముందు కూడా మచిలీపట్నంలో స్థానిక MLA పేర్ని నాని ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున దొంగ పట్టాలు ఇచ్చారని ఆరోపణలు వినిపించాయి. ఈ అంశంపై టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా కలెక్టర్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది.

Latest Articles

దర్శకుల సమక్షంలో ‘ఏఎల్‌సీసీ’ బిగ్ టికెట్ లాంచ్

యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్