Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

బీఆర్ఎస్ కు బీజేపీ గండం పొంచి ఉందా…?

తెలంగాణ రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని గులాబీ పార్టీ ఆందోళన చెందుతోందా.? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు కమలానికి పడ్డాయా.?ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలపైగులాబీ పార్టీలో చర్చ జరుగుతోందా.?

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి బీజేపీతో గండం పొంచి ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమకు ప్రత్యామ్నాయంగా ఎదగడం ఖాయమని గులాబీ పార్టీలో టాక్ వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓట్లు బీజేపీ వైపునకు మళ్ళినట్లుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీలో చేరి నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బిఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ గోడెం నగేష్ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నాగర్ కర్నూల్ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరి తన కుమారుడు భరత్ కు బీజేపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. బిఆర్ఎస్ మాజీ ఎంపీబూర నర్సయ్య గౌడ్ భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బిఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ చేతిలో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడించింది. మునుగోడు ఉప ఎన్నికనలో బీఆర్ఎస్ అభ్యర్థికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో బీజేపీ గట్టి పోటీనిచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఈ తరహా పోరు సాగుతుండగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్, బీజేపీలు ఓటమి పాలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలకే పరిమితం అయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య జోరుగా సమరం సాగుతోంది. ఇంతకు ముందు బీఆర్ఎస్ తో పోరాటం సాగించిన బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీతో పోరు సాగిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే పోటీ అని ఈ రెండు పార్టీల నేతలు ప్రచారం చేశారు.

తమను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒకటయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కరీంనగర్ ఎంపి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కామెంట్ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ పంచన చేరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయనే టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో ! బీఆర్ఎస్ ఏ విధంగా నిలదొక్కుకుంటుందో ఎవరు ఎవరికి సన్నిహితులో ఎవరు ఎవరికి విరోధులో అంతా భవితే చెప్పాలి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్