వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్ ఇచ్చింది. రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు రూ.2.15 కోట్లు ఒప్పందం చేసుకుని..1.15 కోట్లు చెల్లించారని ఫైబర్ నెట్ తెలిపింది. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా గతంలో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి కోటీ 15 లక్షల వరకూ అనుచిత లబ్ధి పొందారని.. దీనిపై వివరణ కోరుతూ వ్యూహం సినిమాకు లీగల్ నోటీస్ ఇచ్చినట్లు ఏపీ ఫైబర్ నెట్ స్పష్టం చేసింది.