28.2 C
Hyderabad
Thursday, February 19, 2026
spot_img

ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌ పోటాపోటీగా సాగింది. బీజేపీ తరపున మోదీ, అమిత్‌ షా, ఎన్డీఏ నేతలు ప్రచారం చేయగా.. కాంగ్రెస్‌ తరపున రాహుల్‌ గాంధీ, ప్రియాంక, ఖర్గే పాల్గొన్నారు. 70 అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్‌ జరగనుంది. ఈనెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వరుసగా నాలుగో సారి విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది.

మరోవైపు మూడు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక.. ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్.. ఢిల్లీలో తన మిత్రపక్షమైన ఆప్‌పై పోటికి దిగింది. ఆప్, కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తుండగా.. బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. మిగిలిన రెండు సీట్లను జేడీయూ, ఎల్‌జేపీకి కేటాయించింది. సీపీఐ 6, సీపీఎం 2, సీపీఐ ఎంఎల్ 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 70, ఎన్సీపీ 30, ఏఎస్పీ 15, AIMIM రెండు చోట్ల బరిలోకి దిగాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్