స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలోని విద్యుత్ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. విద్యుత్ రంగంలో దేశం ముందుందని.. అందులో తెలంగాణ ఒక భాగంగా ఉందన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో 150 శాతం అప్పులు పెరిగాయన్నారు. నేషనల్ ర్యాంకింగ్ లో తెలంగాణ కు సీ మైనస్ వచ్చిందని అన్నారు. ఇరిగేషన్ 2014లో 100 కోట్లు ఉంటే 9000 కోట్లకు పైన అప్పులు పెరిగాయని తెలిపారు. అలాగే మున్సిపల్ శాఖలో 1500 కోట్లు అప్పు పెరిగిందని అన్నారు. ప్రగతి భవన్ లో కరెంట్ బిల్లు ఖర్చు ఎంత వస్తుంది..? అంటూ ప్రశ్నించారు.
సింగరేణిలో జెన్కో, ట్రాన్స్కో బకాయిలు ఉన్నాయని.. సింగరేణినీ డిస్కంలు ముంచుతున్నాయని మండిపడ్డారు. భద్రాచలం, కొత్తగూడెంలో పదకొండు వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ లను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని అన్నారు. పీవీ నరసింహారావు పాలనలో పవర్ కట్ అధికంగా ఉండేదని.. 2015 మోది ప్రభుత్వం వల్ల పవర్ రిఫార్మ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. 2015 లో మోడీ ప్రభుత్వం వచ్చాక పవర్ డిమాండ్ కంటే ఉత్పత్తి ఎంతో పెరిగిందని వ్యాఖ్యానించారు.