స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ పరిధిలోని మస్తాన్నగర్లో కార్డన్ సెర్చ్ చేశారు పోలీస్ అధికారులు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి నేతృత్వంలో అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ, 11 సెర్చ్ పార్టీలు, దాదాపు 150 మంది పోలీసు సిబ్బందితో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నలుగురు పాత నేరస్తులను గుర్తించారు. సరైన పత్రాలు లేని నాలుగు వెహికిల్స్, రెండు బెల్టు షాపులు గుర్తించి 400 కాటన్ల మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు.