కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి(Jana Reddy) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మోకాలు శస్త్ర చికిత్స కోసం నిన్న యశోద హాస్పిటల్ లో జానారెడ్డి చేరారు. వైద్యపరీక్షలు జరిపిన డాక్టర్లు.. మోకాలి చికిత్స కోసం ఆంజియోగ్రామ్ టెస్ట్ చేశారు. మోకాలి వద్ద ఒక వాల్ బ్లాక్ కావడంతో స్టంట్ వేశామని.. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.