స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ విలీనంపై వస్తున్న వార్తలపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి పార్టీ పెట్టలేదని తెగేసి చెప్పారు. నేను విలీనం చేయాలి అనుకుంటే.. పార్టీ ఎందుకు పెడతాను? రెండేళ్లుగా కిందపడి మీదపడి పార్టీని ఎందుకు నడుపుతానని అన్నారు. విలీనం చేయాలని అలోచనే ఉంటే 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని అన్నారు. నాకు పార్టీ పెట్టకముందే నాకు ఎన్నో ఆఫర్లు ఉన్నాయి.. కానీ అవన్నీ కాదని వైఎస్సార్ పేరు మీద పార్టీ పెట్టాను. పార్టీ పెట్టినప్పటి నుండి అనేక పోరాటాలు చేసి వైఎస్ఆర్టీపీ ఒక ఫోర్స్ లా తయారయ్యిందని అన్నారు. ఇప్పటికి తెలంగాణాలో షర్మిల అంటే తెలియని వాళ్లు లేరన్నారు. అయితే ఇటీవలే ఢిల్లీకి చెందిన ఒక సర్వే సంస్థ 44 సీట్లలో ప్రభావం చూపిస్తుందని తేలింది. ఇది నేను చేసింది కాదు. నాకు సంబంధం కూడా లేదు. 44 సీట్లలో నా ప్రభావం ఉంటే.. 5 సీట్లకో.. 10 సీట్లకో పొత్తులకు పోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.