33.2 C
Hyderabad
Tuesday, June 3, 2025
spot_img

పొత్తులపై కాంగ్రెస్‌, వామపక్ష నేతల భేటీ

    ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై రాజకీయ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా.. తాజాగా పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావే శమయ్యాయి. పీసీసీ చీఫ్ షర్మిలతో సీపీఐ, సీపీఎం నేతలు భేటీ అయ్యి.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు.

       పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైసీపీ, టీడీపీలు బీటీంలు గా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సీపీఎం, సీపీఐతో కలిసి కాంగ్రెస్ పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పని చేస్తామన్నారు. బీజేపీ, వైసీపీని దెబ్బ కొట్టేలా పని చేస్తామన్నారు. పొత్తుల‌పై తమ‌ మధ్య చర్చ జరిగిందని.. ముందు ప్రజా సమస్యపై కలిసి వెళతామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనెల 26న ఏపీకి వస్తు న్నారని, ఆరోజు కూడా వామపక్ష పార్టీలు నేతలతో మరో సారి భేటీ అవుతామ న్నారు. భవిష్యత్తులో తప్ప కుండా కలిసి పని చేస్తామని, కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి ఇంత అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఓడించాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో మోడీ హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. ఏపీకి కాంగ్రెస్ వల్లే న్యాయం జరుగుతుందని షర్మిల స్పష్టం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్