25.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

జీహెచ్‌ఎంసీ సమావేశంలో గందరగోళం.. బీఆర్ఎస్‌ కార్పొరేటర్ల సస్పెన్షన్‌

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. 6 గ్యారంటీల అమలుపై బిఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. అయితే బడ్జెట్‌పై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్‌ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్‌ ప్రదర్శించిన ప్లకార్డులను కాంగ్రెస్ కార్పొరేటర్లు చించివేశారు. రెండు పార్టీల కార్పొరేటర్ల మధ్య గొడవ జరగడంతో మార్షల్స్‌ వచ్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్‌ బయటకు తీసుకెళ్లారు

మేయర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. మేయర్‌ విజయలక్ష్మి బడ్జెట్‌పై మాట్లాడాలని కోరారు. క్వశ్చన్‌ అవర్‌ కోసం బీఆర్ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు. మేయర్‌ ప్రజా సమస్యలపై చర్చిద్దామని సర్దిచెప్పినా బీఆర్ఎస్‌ కార్పొరేటర్లు పట్టువీడలేదు. ఈక్రమంలో ఆమె మార్షల్స్‌ తీసుకెళ్లిన కార్పొరేటర్లను తిరిగి సభలోకి తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఆ నలుగురు కార్పొరేటర్లు లోనికి రావడానికి నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్‌ కార్పొరేటర్లందరినీ మేయర్‌ సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్‌ బయటికి పంపించగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్