25.2 C
Hyderabad
Friday, November 14, 2025
spot_img

పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం జగన్

స్వతంత్ర, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. రేపు 12వ తేదీ ఉ. 9 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో క్రోసూరుకు రానున్నారు. క్రోసూరు మోడల్ స్కూల్ లో జగనన్న విద్యాకానుక నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అనంతరం అమరావతి – బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.149 కోట్లతో అమరావతి – బెల్లంకొండ రోడ్ నిర్మాణం జరుగనుంది. అనంతరం మాదిపాడు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రూ.60 కోట్లతో కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగనుంది. అలాగే క్రోసూరులో రూ.7.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజిని సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్