29.2 C
Hyderabad
Saturday, February 7, 2026
spot_img

చంద్రబాబు పై ఫైర్ అయిన సీఎం జగన్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ను దొంగల ముఠా దోచుకుందని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు సీఎం జగన్. చంద్రబాబు పరిపాలనలో జన్మభూమి కమిటీలతో మొదలుపెడితే అమరావతి భూముల వరకు స్కాములే జరిగాయని సీఎం జగన్ ఆరోపించారు. ‘స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ నెట్, మద్యం కొనుగోళ్లలో కూడా ఎక్కడపడితే అక్కడ స్కామ్ చేసి దోచేయడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం. ఇది తప్ప ఏమి కనిపించలేదు.
కానీ ఈ నాలుగు ఇళ్లలో రూ. 2.38 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో మేము జమ చేశాం’ అని వాక్యానించారు.నాలుగేళ్లు ఎక్కడ అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశామని సీఎం జగన్ వెల్లడించారు. ‘ప్రతి అడుగులో వెనుకబడిన వర్గాల చేయి పట్టుకొని నడిపిస్తున్నాం. నాలుగేళ్లలో అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. నవరత్నాలతో ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం. ఎక్కడ, ఎవరు లంచం అడగడం లేదు. బటన్ నొక్కగానే ఖాతాల్లోకి నగదు వస్తుంది. గతానికి ఇప్పటికీ తేడాను గమనించాలి’ అని జగన్ కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్