28.3 C
Hyderabad
Monday, June 2, 2025
spot_img

సిట్‌ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేయిస్తానని ప్రకటించిన సీఎం చంద్రబాబు

తిరుమలలో కల్తీ నెయ్యి వాడకం, ఇతర అధికార దుర్వినియోగాలపై సిట్‌ ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ సిట్‌ టీమ్‌తో పాటు టీమ్‌ సభ్యులను కూడా ప్రకటించబోతుంది. ఐజీ అంతకంటే పైస్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. సిట్‌ టీమ్‌ ఏర్పాటుపై నిన్న సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు చర్చించారు.

సిట్‌ టీమ్‌కు సంబంధించి పలువురు పేర్లను పరిశీలిస్తున్నారు చంద్రబాబు. IPS పీహెచ్‌డీ రామకృష్ణ, సర్వశ్రేష్ట త్రిపాఠి ,వినీత్ బ్రిజ్‌లాల్‌, సీహెచ్‌ శ్రీకాంత్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ బృందం నెయ్యి కొనుగోలు, టెండర్లపై దర్యాప్తు జరపనుంది. నిర్దేశిత సమయంలోగా నివేదిక అందించేలా సిట్ టీమ్ కు ఆదేశాలు జారీ చేయనుంది ప్రభుత్వం. సిట్‌ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేయిస్తానని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. సిట్‌ నివేదిక అనంతరం కల్తీ నెయ్యి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం సిట్‌ నివేదిక తర్వాత మరిన్ని సంస్కరణలు, చర్యలకు ఉపక్రమించనుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్