UPSC ప్రతిష్ఠాత్మక నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. హైదరాబాద్, వరంగల్లోని పలు కేంద్రాల్లో పరీక్షాలు రాస్తున్నారు. ఉదయం 9.30 గంటల ప్రారంభమైన పేపర్ 1 పరిక్ష పదకొండున్నరకు ముగుస్తుంది. ఇక, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తారు. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా ప్రిలిమ్స్కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 49 వేల 883 మంది ఉన్నారు. హైదరాబాద్లో 45 వేల 153 మందికి 99 పరీక్ష కేంద్రాలను, వరంగల్లో 4 వేల 730 మందికి 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేశారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.