Site icon Swatantra Tv

దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష

   UPSC ప్రతిష్ఠాత్మక నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌, వరంగల్‌లోని పలు కేంద్రాల్లో పరీక్షాలు రాస్తున్నారు. ఉదయం 9.30 గంటల ప్రారంభమైన పేపర్ 1 పరిక్ష పదకొండున్నరకు ముగుస్తుంది. ఇక, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్‌-2 నిర్వహిస్తారు. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా  ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 49 వేల 883 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 45 వేల 153 మందికి 99 పరీక్ష కేంద్రాలను, వరంగల్‌లో 4 వేల 730 మందికి 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేశారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Exit mobile version