విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పింది. ఉక్కుపరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. స్టీల్ప్లాంట్ పనితీరు మెరుగుపడడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(RINL) తమ వంతు కృషి చేస్తున్నాయంటూ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రైవేటీకరణను కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
Read Also: అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
Follow us on: Youtube, Koo, Google News