16.7 C
Hyderabad
Friday, January 24, 2025
spot_img

7గంటల పాటు అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ

స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ అధికారులు 7 గంటల పాటు అవినాశ్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు. వివేకా హత్య రోజు జరిగిన వాట్సాప్ కాల్స్‌పై సుదీర్ఘంగా విచారించి.. ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభంకాగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. విచారణలో భాగంగా అవినాశ్ వ్యక్తిగత మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరింత విచారణ కోసం వచ్చే శనివారం అవినాష్ రెడ్డిని పూర్తి స్థాయిలో అధికారులు ప్రశ్నించనున్నారు. ఒకవేళ ఈలోపు ఏమైనా కీలక సమాచారం కావాలని సీబీఐ భావిస్తే మరోసారి నోటీసు జారీ చేసి విచారించే అవకాశం ఉందని సమాచారం. కాగా మే 31న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు.

Latest Articles

విశాఖ ఉక్కు పరిశ్రమపై భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌ ప్రకటిస్తే కొందరు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్