Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

నెత్తురోడుతున్న రహదారులు !

   రోడ్డు ప్రమాదాలకు ఒకటి కాదు అనేక కారణాలున్నాయి. మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిద్రమత్తు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ప్రధాన కారణాలు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎక్కువగా సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు అధునాతన బైక్‌లతో ఓఆర్‌ఆర్ పై విన్యాసాలు చేసే ట్రెండ్ ఇటీవలికాలంలో పెరిగింది. కుర్రాళ్లు బైక్‌ స్పీడ్‌ను విపరీతంగా పెంచుతున్నారు. రయ్‌ రయ్ మంటూ…ఓఆర్‌ఆర్ పై కుర్రాళ్లు దూసుకుపో తున్నారు. ఈ నేపథ్యంలో సదరు బైక్‌కు ఏదైనా అకస్మాత్తుగా అడ్డు వస్తే పరిస్థితి ఉల్టాపల్టా అవుతోంది. చివరకు బైక్ నడిపే కుర్రాడు ప్రాణాలు కోల్పోతున్నాడు.

    రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రమాదాలతో రోడ్డు నెత్తురోడుతున్నాయి. దాదాపుగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. భద్రతా నిబంధనలు పాటించకపోవడమే రోడ్డు ప్రమాదాలు పెరగడానికి కారణం అంటున్నారు నిపుణులు. అనేక ప్రమాదాల్లో మితిమీరిన వేగంతో వాహనాలు నడపడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కారులో ప్రయాణించే వారందరూ సీట్ బెల్ట్‌ పెట్టుకోవాలన్నది నిబంధన. అయితే ఈ నిబంధనను చాలా మంది పట్టించుకోవడం లేదు. సీట్ బెల్ట్‌ పెట్టుకోవడాన్ని చాలా మంది,చిన్నచూపుగా భావిస్తున్నారు. సీట్ బెల్ట్‌ పెట్టుకుంటే, కారు యాక్సిడెంట్‌కు గురైనా, ఎయిర్ బ్యాగ్స్ తెరచుకుంటాయి. ప్రాణాలు కోల్పోవడం జరగదు. గాయాలతో బయటపడతారు. ఇటీవలికాలంలో సిటీ శివార్లలో బర్త్‌ డే పార్టీలు జోరందుకున్నాయి. రాత్రంతా మద్యం తాగి…ఆ నిషా దిగకముందే తెల్లవారుజామున కారు వేసుకుని మిత్రబృందం బయల్దేరుతుంది.మద్యం తాగి వాహనం నడపడం అంటే ప్రమాదాన్ని కోరితెచ్చుకోవడమే.నిద్రలేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు మరో కారణం అంటున్నారు నిపుణులు. సహజంగా చాలా మంది రాత్రి అంతా వాహనాలను నడుపుతూనే ఉంటారు. కొన్ని నిమిషాలపాటు కూడా నిద్రపోయారు. దీంతో తెల్లవారుజామున వాహనం నడిపేవారిపై నిద్రలేమి ప్రభావం పడుతుంది. చివరకు ప్రమాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో లాంగ్ డ్రైవ్‌లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని గంటల తరువాత తప్పనిసరిగా మరో వ్యక్తి డ్రైవింగ్ సీటులో కూర్చోవాలని సలహా ఇస్తున్నారు. ఇదిలాఉంటే చాలా రోడ్డు ప్రమాదాలు చలికాలంలో జరుగుతున్నాయి. చలికాలంలో రోడ్లపై మంచు ఎక్కువగా పరచుకుంటుంది. దీనివల్ల కొన్ని మీటర్ల అవతల ఏముందో కూడా కారు నడిపేవారికి కనపడదు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఇదొక కారణం అంటున్నారు నిపుణులు. అయితే ఇక్కడో విషయం గమనించాలి. నిబంధ నలు కేవలం బైక్‌లు, కార్లు నడిపేవారికే అనే దురభిప్రాయం చాలామందికి ఉంది. అయితే పాదచారులు కూడా నిబంధనలు పాటించాల్సిందే. కొన్ని సంద‌ర్భాల్లో పాద‌చారులు నిర్ల‌క్ష్యంగా మొబైల్‌ మాట్లాడుతూ రోడ్డు దాటుతుంటారు. అలాంటి స‌మ‌యాల్లో రోడ్డు ప్ర‌మాదాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్ల‌పై న‌డిచేట‌ప్పుడు ఒక‌టికి రెండు సార్లు ఆ దారిలో వాహ‌నాలు వ‌స్తు న్నాయో, రావ‌డం లేదో అని పాదచారులు చూసుకోవాలి.అంతా ఓకే అనుకున్నాకే …రోడ్డు దాటాలి. సాధ్య మైనంత వరకు జీబ్రా లైన్ల నుంచే పాదచారులు రోడ్డు దాటాలి.

     ఆటోలు, కార్లు, తుఫాన్ లాంటి వాహనాలలో ప‌రిమితికి మించి ప్రయాణికుల‌ను డ్రైవ‌ర్లు ఎక్కిస్తుంటారు. ఇది అందరూ ప్రతిరోజూ చూస్తున్న తతంగమే.కొన్ని సంద‌ర్భాల్లో డ్రైవ‌ర్‌కే చోటు లేనంత‌ గా వాహ‌నాలు కిక్కిరిసి పోతుంటాయి. అయితే ఇలా ప్రయాణికుల‌ను ఎక్కించ‌డం ప్ర‌మాదక‌రం. ఇలాంటి సంద‌ర్భాల్లో రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.మ‌న దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న జాతీయ, రాష్ట్ర ప్ర‌ధాన ర‌హ‌దారుల నిర్మాణంలో అనేక లోపాలున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. క్రాసింగ్‌లు స‌రిగ్గా క‌నిపించ‌క‌పోవ‌డం, సిగ్న‌ల్స్ లేక‌పోవ‌డం, సూచిక బోర్డులు, హెచ్చ‌రిక చిహ్నాలు, డివైడర్లు లేకపోవడం వంటి అనేక కారణాలవల్ల కూడా రోడ్డు ప్ర‌మాదాలు అధికంగా జ‌రుగుతున్నాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. క‌నుక ఈ దిశ‌గా కూడా సంబంధిత అధికారులు, ప్ర‌భు త్వాలు ఆలోచించాలి. ఇదిలా ఉంటే, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డ కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎక్కువగా సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు అధునాతన బైక్‌లతో ఓఆర్‌ఆర్ పై విన్యాసాలు చేసే ట్రెండ్ ఇటీవలికాలంలో పెరిగింది. బైక్‌ స్పీడ్‌ను విపరీతంగా పెంచుతున్నారు. రయ్‌ రయ్ మంటూ…ఓఆర్‌ఆర్ పై కుర్రకారు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో సదరు బైక్‌కు ఏదైనా అకస్మాత్తుగా అడ్డు వస్తే పరిస్థితి ఉల్టాపల్టా అవుతోంది. చివరకు బైక్ నడిపే కుర్రాడు ప్రాణాలు కోల్పోతున్నాడు. ఓఆర్‌ఆర్ పై జిగ్‌ జాగ్ డ్రైవింగ్ చేయడం చాలా మంది కుర్రాళ్లకు ఫ్యాషన్ గా మారింది. జిగ్‌ జాగ్ డ్రైవింగ్…చాలా డేంజరస్ అని ట్రాఫిక్ రంగ నిపుణులు గతంలో చాలాసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ నలుగురిలో గొప్ప కోసం లైన్ల మధ్య జిగ్‌ జాగ్ డ్రైవింగ్ కు కుర్రకారు జై కొడుతున్నారు. చివరకు ప్రమాదపు అంచుల వరకూ వెళుతున్నారు.మనదేశంలో ప్రాణాంతక వ్యాధులతో చనిపోతున్నవారికంటే, రోడ్డు ప్రమాదాల ఫలితంగా ఉసురు కోల్పోతున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం భద్రతా చర్యలను ప్రజలు పట్టించుకోకపోవడమే. ఇంటి గడప దాటి బయటి ప్రపం చంలోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తీ, రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలంటున్నారు నిపుణులు. ఏమైనా రోడ్డు ప్రమాదాల నివారణ ఒక్కరి బాధ్యత కాదు. అది అందరి బాధ్యత.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్