స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగం పెరిగింది. ఎండలు మండిపోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్రానికి విద్యుత్ ని అందించేందుకు సింహాద్రి ఎన్టీపీసీలో 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది విద్యుత్ శాఖ. ప్రస్తుతం అందుబాటులోకి రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎండలు మండిపోతున్నందున మున్ముందు మరింతగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.