స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత జైలుకెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారు.. కానీ కవిత అరెస్టు కాకపోవడంతో బీజేపీ & బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన ఒప్పందం ఉందని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీని వల్లే తెలంగాణలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయని కొండా అభిప్రాయం వెల్లడించారు.


