శిరోముండనం కేసులో విశాఖ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఏపీ హైకోర్టు. తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్లో ఫిర్యాదుదారులను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. అనం తరం ఈ పిటిషన్పై తదుపరి విచారణను మే మొదటి వారానికి కోర్టు వాయిదా వేసింది. దళిత యువకులకు శిరోముం డనం కేసులో త్రిమూర్తులుతో పాటు మరో 8 మందికి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 16వ తేదీన విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో విశాఖ కోర్టు తీర్పును తోట త్రిమూర్తులు హైకోర్టులో సవాల్ చేశారు. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తోట త్రిమూర్తులు అభ్యర్థనను తోసిపుచ్చి.. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.


