స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 2023 – 24 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సీట్లకు సంభందించి జూన్ 5 నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. పీహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా వారికి దరకాస్తు తేదీని పెంచుతూ.. జూన్ 24 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు admissions@rgukt.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా విడుదల జూన్ 26న విడుదల చేయనున్నారు.