26.7 C
Hyderabad
Thursday, March 13, 2025
spot_img

సీబీఐ విచారణకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

లిక్కర్ స్కాంలో విచారణ నిమిత్తం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు. ఆయన వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఉన్నారు. అంతకుముందు తన నివాసం నుంచి సీబీఐ ఆఫీసుకు బయలుదేరిన కేజ్రీవాల్.. మార్గమధ్యలో రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మగాంధీకి నివాళులర్పించారు. సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు కేజ్రీవాల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తాను అవినీతిపరుడిని అయితే ప్రపంచంలో మరెవరూ నిజాయితీపరులు ఉండరని తెలిపారు. దేశాన్ని ప్రేమిస్తా.. అవసరమైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా అని పేర్కొన్నారు. సీబీఐ 100సార్లు విచారణకు పిలిచినా వెళ్తానని కేజ్రీవాల్ స్పష్టంచేశారు.

 

Latest Articles

గవర్నమెంట్ విద్యాలయాలకు ఆ నాటి వైభవం తిరిగి వచ్చేనా..? – హస్తం సర్కారు తీరుతో చిగురిస్తున్న ఆశలు

కారణాలు ఏవైనా, తప్పిదాలు ఎవరివైనా...చేతులు కాలిపోయాక పత్రాలతోను, నిండా మునిగిపోయాక రక్షణ చర్యలతోను ఏం ఫలితం ఉంటుంది. ప్రైవేట్ ను పరోక్షంగా ప్రోత్సహించే ప్రభుత్వాలు.. ఆ ప్రైవేట్ పై ప్రత్యక్షంగా దండయాత్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్