తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు నాటికి పూర్తిస్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు చేపడతామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ అన్నారు. తెలం గాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువతతో కలసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి,బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. పదేళ్లలో ఉద్యోగ నియామకాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే అన్నారు. గత పదేళ్లలో ఉపాధి అవకాశాలు లేక అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్బడ్డారని మురళీనాయక్ ఆవేదన వ్యక్తంచేశారు.


