పాము కాటుతో మూడేళ్ల చిన్నారి సాత్విక మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండా శివారు వెంక్యతండాలో జరిగింది. చిన్నారి సాత్విక ఆమె తల్లి స్వరూప రాత్రి బాత్రుంలో స్నానం చేయిస్తుండగా పైనుంచి వచ్చిన పాము చిన్నారిని కాటు వేసింది. తండా వాసుల సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా చిన్నారి మృతిచెందింది. సాత్విక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఉదయం పోలీసులు బల వంతంగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకు న్నాయి. సాత్విక కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ పరామర్శిం చారు.