ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 5గంటలకు విజయవాడలోని కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. కాగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలు 4.84లక్షల మంది విద్యార్ధులు రాయగా.. రెండవ సంవత్సరం పరీక్షలను 5.19లక్షల మంది రాశారు.