31.2 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

బ్రేకింగ్: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు.. నోటీసులు

AP CID Notice |ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అనే రీతిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్యరథంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కథనాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు అందజేశారు.

గతేడాది నవంబరు 23న చైతన్యరథం పత్రికలో మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డిపై వచ్చిన ఓ కథనంపై సీఐడీ అధికారులు నోటీసులు(AP CID Notice) అందించినట్లు సమాచారం. సీఐడీ నోటీసులపై టీడీపీ నేతలు స్పందిస్తూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడానికి వచ్చారని విమర్శించారు. చైతన్యరథనంలో బుగ్గనపై వచ్చిన ఆరోపణలు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇలాంటి నోటీసులతో టీడీపీని దెబ్బతీయలేరని పేర్కొన్నారు.

Read Also: హైదరాబాద్ లో బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు
Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్