స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారుల సెర్చ్ ఆపరేషన్ హైదరాబాద్ లో కొనసాగుతుంది. అధికారుల తనిఖీల్లో ఉగ్రలింకులు బయటపడ్డాయి. ఇప్పటివరకు మొత్తం 17మందిని అరెస్ట్ చేయగా.. వారిలో ఆరుగురు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వరకు ఐదుగురు హైదరాబాద్ వాసులు అరెస్ట్ కాగా, బుధవారం జవహార్ నగర్ కి చెందిన సల్మాన్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా వివిధ రంగాల్లో యువకులను ఉగ్రవాదలోకి మళ్లించే ప్రయత్నం చేశారు.