తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుతో ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనికసలు అంతం ఉందా అనే అనుమానం కలుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో సంచలనం బయ టకు వచ్చింది. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ లను ట్యాప్ చేసినట్టు దర్యాప్తు బృందం గుర్తిం చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో ఫోనలను ప్రణీత్రావు ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. అప్పటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గువ్వుల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగాకాంతా రావ్, హర్ష వర్ధన్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేసి.. ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాడు. ట్రాప్ చేసేందుకు ఫామ్ హౌస్ లో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సీసీ కెమెరాలను అమర్చినట్టు తెలుస్తోంది.


