స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు మరోసారి తప్పిన ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొద్దిదూరంలో మంటలు వ్యాపించాయి. దీంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. హొన్నావర్లోని రామతీర్థకొండ దగ్గర ఈ ఘటన జరిగింది. కాగా, మొన్న హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా పక్షి ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.