Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

అమలాపురం అగ్రహారంలో మరో భద్రాద్రి రామయ్య

   రాముడు ఎక్కడుంటాడు. అయోధ్యలోనే పుట్టినా లోకమంతా ఆయనే కదా అంటారా… అవును లోకమంతా ఆయనే. కాకపోతే అనేక రూపాల్లో కొలువై ఉంటాడు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ అతి ప్రాచీన రామాలయం నెలకొని ఉంది. ఆ నీలమేఘ శ్యాముడు ఇక్కడ ఏ రీతిన కొలువై ఉన్నాడో.. ఆ క్షేత్ర మహత్తు ఏంటో వివరాల్లోకి వెళదాం.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ప్రకృతి శోభతో పాటు ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. నిజానికి ఈ జిల్లాలో శైవ క్షేత్రాలే ఎక్కువ. వాటి మధ్య అమలాపురంలో కొలువుదీరాడు శ్రీ రాముడు. అది కూడా ఓ అగ్రహారంలో. అలాగని ఆయన్ని దర్శించుకు నే వారంతా అగ్రహారీకులు, బ్రాహ్మణులే అనుకునేరు. ఈ ఆలయానికి అన్ని కులాల వారు, మతాల వారు వస్తారు. అయితే, దక్షిణభారత అయోధ్యగా పేరొందిన భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రంలో మాదిరి స్వామివారి సరసన అమ్మవారు ఉండే క్షేత్రం ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించుకుంటే… అమలాపురం భూపయ్య అగ్రహారం పేరు వినిపిస్తుంది. .

      శ్రీరాముడి ఒడిపై కూర్చున్న సీతాదేవిని ఎక్కడైనా చూశారా. భద్రాచల పుణ్యక్షేత్రంలో చూసామంటారా. అవును, నిజమే. అక్కడే కాదు అమలాపురం భూపయ్య అగ్రహారంలో ఉన్న రామాలయంలో సైతం స్వామివారు ఇదే రీతిన దర్శనమిస్తారు. స్వామివారి అంకపీఠంపై సీతమ్మవారు కూర్చుని ఉన్న విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇలాంటి భాగ్యం భద్రాచలం తర్వాత దక్కేది భూపయ్య అగ్రహారంలోని రామాలయంలోనే అని భక్తులు చెబుతున్నారు.ఈ పాట విన్నారు కదా. త్యాగరాజ కృతి. ఈ పాట పాడిన పెద్దావిడ పేరు గంటి ఎగ్గమ్మ . వయసు 95 సంవత్సరాలు. ఈ పెద్దావిడ జీవితమంతా ఆ భూపయ్య అగ్రహారం రామాలయంలోనే గడుపుతోంది. మీ రాముడి గురించి చెప్పండమ్మా అని అడిగితే కన్నీటి పర్యంతమయ్యారు. అంతే కాదు. తన ఏడో ఏట నుంచి ఈ రామాలయమే ఆవిడకి పెద్ద దిక్కు అయ్యింది. మా రాముడి గురించి చెప్పడానకేముంది నాయనా. అన్నీ ఆయనే… అంతటా ఆయనే అన్నారు. భూపయ్య అగ్రహారానికి ఓ చరిత్ర ఉంది. ఇక్కడందరూ బ్రాహ్మణులే అయినా ఈ అగ్రహారాన్ని ఏర్పాటు చేసింది క్షత్రీయులు. కలిదిండి భూపయ్య రాజు అనే ఓ క్షత్రియుడు చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణులకు ఇంటి స్ధలం, రుబ్బురోలు, తిరగలి దానంగా ఇచ్చి ఈ అగ్రహారాన్ని ఏర్పాటు చేశారు. అలా ఆ భూపయ్య పేరిట ఏర్పడిందే భూపయ్య అగ్రహారం.

     అగ్రహారం ఏర్పడిన తర్వాత ఆలయం ఒకటి ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ రామాలయాన్ని ఏర్పాటు చేసారని చరిత్ర చెబుతోంది. అప్పటికే భద్రాచల రామయ్యను దర్శించుకున్న అగ్రహారీకుల్లో కొందరు పెద్దలు ఈ రీతినే ఇక్కడ రామాలయ నిర్మాణం చేయాలని తలచి రాముడి ఒడిపై కూర్చున్న సీతాదేవి ప్రతిమతో ఆలయాన్ని నిర్మించారు. ఇది జరిగి 200 సంవత్సరాలైంది. ఆ రోజు నుంచి నేటి వరకూ ఈ భూపయ్య అగ్రహారం రామాలయానికి విశేషమైన పేరొచ్చింది. ఇక్కడ నిర్మితమైన రామాలయానికి అగ్రహారంలోని పెద్దలు ఒక్కోటి సమకూర్చడం, ఆ స్వామి కల్యాణం వంటివి జరిపించడం ఓ క్రతువులా ప్రారంభమైంది. గడిన రెండు వందల సంవత్సరాలుగా రామాలయంలో ప్రతి ఏటా కల్యాణం, ఇతర ఉత్సవాలు జరుపుతున్నారు. తొలి రోజుల్లో కేవలం బ్రహ్మాణులే వచ్చినా రాను రారు ఇతర కులాలు, మతాలకు చెందిన వారి కాక ప్రారంభమైంది. అలా ఇప్పుడు ఈ రామాలయానికి నిత్యం వివిధ జిల్లాల నుంచి భక్తుల రాక ప్రారంభమైంది.దేవాలయం అంటే దేవదేవుడు కొలువైన ఇల్లు. దైవానుగ్రహం కోసం వచ్చే భక్తులను చల్లగా చూసేది దైవం. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భాసిల్లిన ఆలయానికి తండోప తండాలుగా భక్తులు రావడం సహజమే. ఈ కోవకు చెందిన భూపయ్య అగ్రహారం రాముడి ప్రత్యేకత ఇప్పుడు చూద్దాం.

     రెండు శతాబ్దాల క్రితం భూపయ్య అగ్రహారంలో రాముడికి మందిరం కట్టారు. అప్పటి నుంచి నిత్య పూజలు సాగుతున్నాయి. అయితే, ఓ పెద్దావిడకి ఇక్కడ ఓ లోపం కనిపించింది. అదే అమ్మవారు సీతాదేవి విగ్రహానికి ఒక్క బంగారు నగ కూడా లేకపోవడం. అంతే ఆ భక్తురాలు తన వొంటి మీదున్న బంగారాన్ని తీసేసి అమ్మవారికి ఆభరణాలు చేయించారు. అలా చేయించిన భక్తురాలే అయ్యల సోమయాజుల నర్సమ్మ. ఇక్కడి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు స్వామి వారి దర్శనం తర్వాత కచ్చితంగా జపించే పేరు ఈ భక్తురాలిదే కావడం విశేషం. ఒక్కో గుడిలో ఒక్కో దేవుడిది ఒక్కో ప్రత్యేకత. కొందరు పిల్లలు లేని వారు పిల్లల కోసం కోరుకుంటారు. మరికొందరు ఉద్యోగం కోసం దేవుడ్ని వేడుకుంటారు. మరి కొందరు పిల్లల పెళ్లిళ్ల కోసం వరాలడుగుతారు. ఇది ప్రతి దేవాలయంలోనూ జరిగే ఓ క్రతువు. అయితే, భూపయ్య అగ్రహారంలో వెలసిన శ్రీరాముడిని మాత్రం భక్తులు అన్ని కోరికలు కోరతారు.

    బిడ్డలు కలగని వారు ఈ రాముడ్ని దర్శించుకుని తమ కోరికను ఆ స్వామికి చెబితే ఆ కోరిక నెరవేరుతుందని ఓ నమ్మకం. ఉద్యోగార్ధులు కూడా తమ జీవితం స్ధిర పడాలని ఈ రాముడ్ని అర్ధిస్థారు. ఆ కోరిక ఈడేరుతుంది. పెళ్లి కాని బ్రహ్మచారులు తమ కోరికలను ఈ రాముడి చెవిలో వేస్తారు. చిత్రంగా ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా అందరి కోరికలు తీర్చే నీలమేఘ శ్యాముడు భూపయ్య అగ్రహార శ్రీరాముడు. రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ రామాలయాని కి భక్తులు కానుకగా సమర్పించిన ఎన్నో భూములున్నాయి. నలభై ఏళ్ల క్రితమే ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనం లోకి వెళ్లింది. ఆనాటి నుంచి ప్రభుత్వ పరంగానే అనేక వేడుకలు జరుగుతున్నాయి. శ్రీరామ నవమి, ముక్కోటి ఏకాదశి తదితర పర్వదినాల్లో ఆలయంలో విశేషపూజలు నిర్వహిస్తారు. ఆలయంలో అట్టహాసంగా పండుగ వేడుకలు చేసినా, భక్తులందరూ ఆ వేడుకలనను తమ ఇంట్లో జరిగే సంభరాల్లో భావించి, ఇందులో అన్నివిధాలా భాగస్వామ్యం అవుతారు.భూపయ్య అగ్రహారం శ్రీరామాలయంలో నిత్య పూజలు, కల్యాణంతో పాటు అనేక పర్వదినాల్లో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఆ వేడుకల్లో పాల్గొనేందుకు అమలాపురం వస్తారు.

    ఆలయంలో వైభవోపేతంగా జరిగే పూజలు, నిత్యానుష్టానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రతి రోజు సీతాలక్ష్మణహనుమత్‌ సమేత శ్రీరాముడికి పూజలుంటాయి. ఇక శ్రీరామ నవమి వచ్చిందంటే రెండు నెలల ముందు నుంచే స్వామి వారికి కల్యాణం జరిపించే క్రతువు ప్రారంభమవుతుంది. ఈ క్రతువులో భూపయ్య అగ్రహారానికి చెందిన వారే కాకుండా అమలాపురం పట్టణంలోని పుర ప్రముఖులు మేము సైతం అని పాల్గొంటారు.దేవుని పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. మర్యాద పురుషుడు, పిత్రు వాక్ పరిపాలకుడు, ఏకఏ పత్నీవ్రతుడైన సుగుణాభిరాముడి గుళ్లో వేడుకలు అంటే.. భక్తులకు అంతకంటే కావల్సింది ఏముంటుంది. అందుకే, అంబరాన్నంటేలా పండగ సంబరాలు చేసుకుంటారు.

      ప్రతి ఏటా మార్గశిర నవమి నాడు స్వామివారి కల్యాణం జరుపుతారు. నాలుగు రోజుల పాటు ఈ కల్యాణ వేడుకలు అత్యంత రమణీయంగా నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. నవమి నాడు జరిపే శాంతి కల్యాణం తర్వాత దశమి నాడు రథం ఊరేగింపు నిర్వహిస్తారు. ఏకాదశి నాడు లక్ష తులసి పూజ నిర్వహిస్తారు. ఈ క్రతువుకు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వయంగా ఈ పూజలో పాల్గొనడం విశేషం. ఇక చివరిదైన ద్వాదశి నాడు వేలాది మందితో అన్న సమారాధన నిర్వహిస్తారు. ఈ సమారనాధనకు సంఖ్యను లెక్కించడం అంటే ఓ సాహసమే. సీతారామ కళ్యాణ మహోత్సవం, వైకుంఠ ఏకాదశి తదితర పవిత్ర పర్వదినాల్లో వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. అయితే, అమలాపురం భూపయ్య అగ్రహార రామయ్య దేవాలయంలో.. ఈ పండుగ వేడుకలతో పాటు కార్తీక మాసంలో జరిగే లక్ష తులసి పూజ, 16 రోజుల పాటు జరిగే వసంత పూజ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

    మాసానాం కార్తీకం పవిత్రం అంటారు. పవిత్ర కార్తీక మాసంలో ప్రధానంగా తొలి పదిహేను రోజులు శివ ప్రీతిగా, మలి పదిహేను రోజులు కేశవ ప్రీతిగా పూజాదికాలు చేస్తారని చెబుతూంటారు. కార్తీకమాసంలో అధికంగా శైవక్షేత్రాలు శోభిల్లడం, మార్గశిర మాసంలో వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడడం చూస్తుంటాం. కార్తీకంలో.. శివాలయాల్లో లక్ష పత్రి పూజ, లక్ష బిల్వార్చనలు జరుగుతాయి. అయితే, ఇక్కడ కార్తీక మాసంలో లక్ష తులసి పూజ అత్యద్భుతంగా జరుగుతుంది. ఈ వేడుకలో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొంటారు. భూపయ్య అగ్రహారం రామయ్య ఆలయంలో వసంతపూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 16 రోజులపాటు ఈ వేడుక జరుగుతుంది. ఈ పవిత్ర దేవాల యంలో శ్రీరాముని సేవా కార్యక్రమాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. మూడో రోజు పుష్పోత్సవం, అయిదో రోజు చక్రస్నానం కన్నుల పండువగా సాగుతాయి. ఈ వేడుకలో అగ్రహారీకులే కాక..దేశ, విదేశాల్లో ఉన్న ఈ పట్టణవాసులందరూ హాజరవ్వడం విశేషం. ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నా ఆలయ వ్యవహారాలన్నీ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. అయితే, దేవాదాయ శాఖ సైతం ఇందుకు వ్యతిరేకత చూపకపోవడం విశేషం. దేవాదాయ శాఖకు చెందిన ఉన్నతాధికారులు నిత్యం ఆలయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు దగ్గరుండి పర్యవేక్షిస్తారు.

     పాడితే రామయ్య పాటనే పాడాలి.. వేడితే ఆ అయ్యనే వేడుకోవాలి అన్నాడు సినీ కవి. రామరాజ్యంలో దానం చేసేవారు తప్ప, దానం పొందేవారే కనబడరని నానుడి. అంతటి గొప్ప దేముడు కాబట్టే రామయ్యకు అడుగడుగునా ఆలయాలు కనిపిస్తాయి. దేశంలో రామాలయం లేని పల్లె లేదంటే అతిశయోక్తి కాదేమో. అంతంటి మహనీయుడైన శ్రీరామచంద్రమూర్తి మహోన్నత దేవాలయాల్లో ఒకటిగా భూపయ్య అగ్రహారం రామాలయం పేరు సంతరించుకుంది. దేవాదాయ శాఖ ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టింది. ఇందుకోసం ఆ శాఖ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి, ఆగ్రహారీకులు కమిటీగా ఏర్పడి ఆ పనులు చేపడుతున్నారు. ఏడాది లోపున ఈ ఆలయ పునర్ నిర్మాణ పనులు పూర్తవ్వ వచ్చని భక్తులు భావిస్తున్నారు. స్వామివారికి ఉన్న భూములు, ఇతరేతర ఆదాయం నుంచి కాకుండా భక్తులు ఇచ్చే విరాళాలతోనే ఈ నూతన ఆలయ నిర్మాణం చేపట్టడం ఈ ఆలయానికి ఉన్న విశిష్టతను తెలియ జేస్తుంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్