ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల విషయంలో చాలా మంది దర్శక, నిర్మాతలు నష్టపోయారని వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో కమ్మ, కాపు కులాల డామినేషన్ లేదని.. కేవలం డబ్బు డామినేషన్ మాత్రమే ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నందుల విషయంలో చాలా మందికి అన్యాయం జరిగిందని.. కులాలుగా విడిపోయి అవార్డులు పంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే టెంపర్ చిత్రానికి తనకు నంది అవార్డు వచ్చినా తిరస్కరించానని పోసాని వెల్లడించారు. త్వరలోనే సీఎం జగన్ తో చర్చించి నంది అవార్డుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీలో షూటింగ్ లు చేస్తే నిర్మాతలకు రాయితీలు కల్పిస్తామని పేర్కొన్నారు.
Read Also: జీతం పడితే చాలనుకునే స్థాయికి వచ్చాం: బొప్పరాజు
Follow us on: Youtube, Instagram, Google News