హనుమకొండలో దారుణం జరిగింది. ఒక ఆటో డ్రైవర్ని మరో ఆటో డ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి పరారయ్యడు.
చనిపోయిన వ్యక్తిని మడికొండకు చెందిన రాజ్కుమార్గా గుర్తించారు. ఇద్దరు ఆటోడ్రైవర్లు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ను మరో ఆటో డ్రైవర్ కత్తితో పొడిచాడు. అనంతరం అతను పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్, హనుమకొండ రహదారిపై ఈ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే ఆటో డ్రైవర్ రాజ్కుమార్పై కత్తితో దాడి చేశాడు. ఉదయం నుంచి ఆటోను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. మృతుడి ఆటోకు అడ్డంగా తన ఆటో పెట్టి .. వెంట తెచ్చుకున్న కత్తితో రాజ్కుమార్ను దారుణంగా పొడిచి చంపేశాడు.