32.2 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

       ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ స్పీడు పెంచింది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్‌ చేసింది. ఇందులో భాగంగా బీజేపీ పెద్దలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రానున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయ్యాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1.20కి బేగంపేట విమానాశ్రయం చేరుకుం టారు అమిత్‌ షా. 1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వాలంటీర్స్ మీటింగ్‌లో దిశానిర్దేశం చేస్తారు.3.15 నుంచి 4.25 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం బూత్ కమిటీ అధ్యక్షులు ఆపై స్థాయి నేతల మీటింగ్‌ లో అమిత్‌ షా పాల్గొంటారు. 4.45 నుంచి 5.45 వరకు ఐటీసీ కాకతీయలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. పార్లమెంట్ ఎన్నికల సమాయత్తత, కార్యాచరణపై మార్గనిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనమ వుతారు అమిత్ షా

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్