గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా గండిపేట్లో కబ్జాదారులు రెచ్చిపోయారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేశాడు. గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9ఎకరాల 36 గుంటల భూమిని అప్పటి మంత్రి అండదండలతో బీఆర్ఎస్ నేత కలెక్టర్ను ప్రభావితం చేసి అడ్డదారిలో పట్టా చేయించుకున్నాడు. ఆ భూమిని గండిపేట తహశీల్దార్ కాపాడాడు. జేసీబీ సహా యంతో ప్రహారీ గోడను నేలమట్టం చేయించి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా పట్టా పాస్ బుక్కును రద్దు చేయించారు.