డ్రైవర్ లేకుండా ట్రైన్ పరుగులు పెట్టడం ఎక్కడైనా చూసారా.. పంజాబ్ లోని హోషియార్ పూర్ లో ఈ ఘటన జరిగింది. కథువా స్టేషన్ లో ఆగిన గూడ్స్ ట్రైన్ డ్రైవర్ లేకుండానే.. ముందుకు కదిలింది.. ఆ ప్రాంతం కాస్త పల్లంగా ఉండడంతో ట్రైన్ పట్టాలపై నెమ్మదిగా సాగింది. ముక్రియన్ లోని ఉచ్చీబస్సీ దగ్గరలో ట్రైన్ ఆగింది. ఆ పట్టాలపై మరో ట్రైన్ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.