36.4 C
Hyderabad
Thursday, May 1, 2025
spot_img

బ్రిటన్ లో తెలుగు యువతి గల్లంతు.. ఆ కుటుంబానికి కేటీఆర్ భరోసా

ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎవరైనా ఆపదలో ఉన్నారని ట్వీట్ చేస్తే చాలు వారిని ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తారు. తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన సాయి తేజస్వీ అనే యువతి బ్రిటన్ లోని క్రాన్‌ఫీల్డ్ యూనివర్శిటీలో ఏరోనాటిక్స్, స్పేస్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేస్తోంది. అయితే ఈ నెల 11న ఆమె బ్రైటన్ బీచ్‌లో గల్లంతై చనిపోయింది. అక్కడి ఆమె మృతదేహాన్ని వెలికితీసి యూకేలోని ఓ ఆసుపత్రిలో ఉంచారు.

దీంతో ఆ యువతి సోదరి ప్రియారెడ్డి మా అక్క యూకే మరణించిందని.. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు హెల్ఫ్ చేయండి సార్ అంటూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన కేటీఆర్ మీ కుటుంబానికి జరిగిన నష్టానికి చాలా చింతిస్తున్నా.. నా బృందం స్థానిక బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ బృందంతో చర్చలు జరుపుతోందని.. వీలైనంత త్వరగా మీకు సహాయం అందిస్తామని హామీ ఇస్తూ రీట్వీట్ చేశారు.

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్