బిరియాని తినడానికి వెళ్లిన యువకులకు షాక్ తగిలింది. హైదరాబాద్ నాచారంలో డాల్పిన్ మండి హోటల్లో బిర్యానీ తింటున్న యువకులకు పురుగు దర్శమించింది. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా బెదిరింపులకు దిగారు. బిర్యానీ లో మీరే వేశారంటూ అసభ్యంగా మట్లాడుతూ… తిన్న దానికి బిల్లు కట్టాలని గొడవకు దిగారు. యువకు లు బిల్లు కట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా ఇలాంటి హోటళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.