రంగారెడ్డి రెడ్డి చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఓ వ్యక్తి హత్య సంచలనం కలిగించింది. ఇంట్లోనే హత్య కు పాల్పడిన దుండగులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేందుకు యత్నించారు. కాళ్లు కట్టి.. మూటలో చుట్టి తరలించే క్రమంలో స్ధానికులకు కంటబడటంతో మూటను వదిలి పరారయ్యారు. ఘటనా స్ధలానికి చేరుకున్న చేవెళ్ళ పోలీసులు మృతున్ని సీపీఐ కాలనీలో అద్దెకు ఉంటున్న మహమూద్గా గుర్తించారు. మృతుని ఒంటిపై గాయాలున్నట్లు తెలిపిన పోలీసులు ఇంట్లో రక్తపు మరకల్ని గుర్తించారు. దీంతో క్లూస్టీమ్తో దర్యాప్తు చేపట్టి ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానితుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు తెలుస్తోంది.