Telangana | దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు గవర్నర్ పెండింగ్ బిల్లుల అంశాలపై విచారణ జరుగనుంది. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం… సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ వద్ద ఉన్న బిల్లుల పొజిషన్ ను గత విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్ జనరల్ తుషార్ మెహతా… మొత్తం 10 బిల్లులలో మూడు బిల్లులు ఆమోదించామని తెలిపారు. రాష్ట్రపతి పరిశీలన కోసం రెండు బిల్లులు పంపగా… గవర్నర్ వద్ద పెండింగులో మూడు బిల్లులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వ పరిశీలన కోసం వెనక్కి పంపినట్లు తెలిపారు.