రాజ్ తరుణ్, లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్తరుణ్పై ఫిర్యాదు చేసి తాము పది సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని ఆరోపిస్తూ.. పూర్తి ఆధారాలను పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు రాజ్ తరుణ్పై కేసు నమోదు చేశారు. తాజాగా ఇవాళ మరో ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. A1 గా రాజ్ తరుణ్ A2గా మాల్వీ మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాను పోలీసులు చేర్చారు.
బుధవారం లావణ్య పోలీసులకు ఇచ్చిన ఆధారాలలో.. 2008 సంవత్సరం నుంచి లావణ్య రాజ్ తరుణ్కు పరిచయమని… 2010 లో ఆమెకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడని తెలిపింది. 2014లో తనను రాజ్తరుణ్ పెళ్లి చేసుకున్నట్లు లావణ్య చెబుతోంది. ఆ సమయంలో తమ కుటుంబం రాజ్ తరుణ్కు 70 లక్షలు ఇచ్చామని.. 2016 లో తాను గర్భవతిని అయ్యానని, రెండో నెలలో తనకు సర్జరీ చేయించి.. హస్పిటల్స్ బిల్లులు కూడా రాజ్ తరుణే కట్టాడని తన ఫిర్యాదులో ఆదారాలతో తెలిపింది. అలాగే కావాలనే తనను డ్రగ్స్ కేసులో మాల్వీ, రాజ్ తరుణ్ ఇరికించారని.. తనను మోసం చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని లావణ్య పోలీసులకు తెలిపింది. మాల్వీ, ఆమె సోదరుడు తనని చంపుతామని బెదిరించారని, ముగ్గురిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది.


