ఖమ్మం జిల్లా(Khammam ) కారేపల్లి మండలం చీమలపాడులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం నెలకొంది. ఆత్మీయ సమ్మేళననానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ వస్తుండడంతో పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. దీంతో గుడిసెకు నిప్పంటుకొని.. లోపల ఉన్న సిలిండర్లు పేలిపోయాయి. ఈ పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. అక్కడే ఉన్న పోలీసులకు, జర్నలిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా 10 మంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
ఖమ్మం ప్రమాదంలో సీఐతో సహా తెగిపడ్డ 10 మంది కాళ్లు, చేతులు
0
424
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


