ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు ఉందా?లేదా? అనే దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. జనసేనతో పొత్తుపై బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు జనసేన నుంచి ఎంత సహకారం అందిందో ప్రజలే ఆలోచించాలని తెలిపారు. కేంద్రంలోని మోదీని పొగుడుతారని.. రాష్ట్రంలో మాత్రం బీజేపీ నేతలను ఎదగనివ్వరని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ-జనసేన పొత్తు ఉండకూడదని కొంతమంది కోరుకుంటున్నారని.. వారి కోరిక ఎప్పటికీ ఫలించదని స్పష్టంచేశారు. కాగా బీజేపీ తమతో కలిసి రావడం లేదని ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత మాధవ్ జనసేననే తమతో కలిసి రావడం లేదని కౌంటర్ ఇచ్చారు. దీంతో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా?లేదా? అనే చర్చ మొదలైంది.
బీజేపీ నేతలను ఏపీలో ఎదగనివ్వడం లేదు: సోము వీర్రాజు
0
296
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


