Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

పీఓకేలో సైన్యంపై ఎదురుతిరిగిన ప్రజలు

    పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో టెన్షన్.. టెన్షన్. ఈ ప్రాంతంలో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.శాంతి భద్రతలు రోజురోజుకూ దిగజారుతుండడం, సైన్యానికి ప్రజలు ఎదురు తిరుగుతుండడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే సైన్యం జరిపిన కాల్పుల్లో మరో ముగ్గురు ప్రజలు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పీవోకేలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు వచ్చిన సైన్యం తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.మొత్తం 11 వాహనాలతో సైనిక బృందం ముజఫరాబాద్ మీదుగా వెళుతున్నప్పుడు ఆందోళన కారులు. భారీ స్థాయిలో రాళ్లు రువ్వారు. దీంతో సైన్యం కాల్పులు జరిపింది. బాష్పవాయువు ప్రయోగించింది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సైతం మృతిచెందారు. 70 మందికి పైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా పీవోకేలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 2300 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రకటించడంతో శాంతి నెలకొంటుందని అంతా ఆశించారు. కానీ, పరిస్థితి అలా లేకపోవడంతో అంతా టెన్షన్ నెలకొంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్