టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని, తనకు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని.. ఏపీ సీఎం జగన్ అన్నారు. 2014లో చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ను పట్టించుకోలేదని మండి పడ్డారు. ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను సైతం మర్చిపోయారన్నారు. సింగపూర్కు మించిన రాజధాని అని చెప్పి కనీసం గ్రాఫిక్స్ రాజధానిని కూడా పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు. చంద్రబాబు డబ్బిస్తే వద్దనుకుండా తీసుకొని ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు సీఎం జగన్.


