పెన్షన్ల పంపిణీలో వైసీపీ డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తామంటూ మరో కొత్త డ్రామా తెరలేపారని ఫైర్ అయ్యారు. ఇంటివద్దే పెన్షన్లు ఇవ్వాలని తాము డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం సర్కార్కు వత్తాసు పలుకుతోందన్నారు చంద్రబాబు. జగన్ మోచేతి నీళ్లు తాగే కొందరు అధికారులు ఆ కుట్రలు, కుతంత్రాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెల పెన్షన్ల పంపిణీలో ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా..చీఫ్ సెక్రటరీ, సీఈవో మురళీధర్రెడ్డి, ధనుంజయరెడ్డిదే బాధ్యత అని చంద్రబాబు హెచ్చరించారు.


