పరిపాలనా రాజధాని దిశగా జగన్‌ అడుగులు

విశాఖే పరిపాలనా రాజధాని అంటూ చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలను కేటాయించినట్లు ఆదేశాలు జారీ చేసింది.

మొత్తం 2 లక్షలా 27 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. అంతే కాదు, కార్యాలయాలు, విడిది అవసరాలకు సైతం భవనాలను కేటాయించింది. ఆంధ్రా యూనివర్సిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలోని భవనాలను అలాట్ చేసినట్లు ఉత్తర్వుల్లో పొందు పరిచారు. ఇక, పలు శాఖలకు ఎండాడ, హనుమంతవాకలో ఇచ్చారు.

భవనాలు కేటాయించిన శాఖల విషయానికి వస్తే.. జీఏడీ, ఆర్థిక, గ్రామ వార్డు సచివాలయ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలను కేటాయించారు. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే..సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడనేది ఈ జీవోలో మాత్రం వెల్లడించలేదు ఏపీ ప్రభుత్వం.

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్